Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారమివ్వాలి : లక్ష్మీపార్వతి డిమాండ్

ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారమివ్వాలి : లక్ష్మీపార్వతి డిమాండ్
, గురువారం, 18 సెప్టెంబరు 2014 (13:17 IST)
తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావుకు భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేయాలని వైకాపాలో చేరిన ఆయన సతీమణి లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఆమె బుధవారం నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద బుధవారం ధర్నా చేశారు. 
 
ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి ఆమె మాట్లాడుతూ... ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరలేదని అన్నారు. కేంద్రానికి రాసిన లేఖలో ఎన్టీఆర్ పేరు లేదని విమర్శించారు. తెలుగు జాతి గర్వించదగ్గ నటుడు ఎన్టీఆర్ అని, తెలుగు ప్రజలు ఎప్పటి నుంచో ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తున్నారని గుర్తు చేశారు. కానీ, అది కార్యరూపం దాల్చడం లేదు. 

Share this Story:

Follow Webdunia telugu