Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చర్చలకు రెడీ.. ఎప్పుడు మాట్లాడుకుందాం: కేటీఆర్

చర్చలకు రెడీ.. ఎప్పుడు మాట్లాడుకుందాం: కేటీఆర్
, శుక్రవారం, 24 అక్టోబరు 2014 (13:30 IST)
తెలంగా రాష్ట్ర సర్కారు ఇరు రాష్ట్రా మధ్య గల సమస్యలను సామరస్యంగా చర్చించేందుకు సిద్ధంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో వున్న విద్యుత్, రైతుల సమస్యల మీద చర్చించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా వుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర దుస్థితికి కాంగ్రెస్, టీడీపీల పాలనే కారణమని విమర్శించారు. ఈ అంశాన్ని రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని ఆయన తెలిపారు.
 
ఈ సమస్యల నుంచి తప్పించుకోవాలని ప్రతిపక్షాలు ప్రయత్నించినా వదలబోమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో గల అన్నీ అంశాలను నెరవేర్చడంతో పాటు కరెంట్ కోతకు చెక్ పెట్టే దిశగా చర్యలు తీసుకుంటున్నామని కేటీఆర్ చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu