Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డికి కేంద్ర సాహిత్య పురస్కారం!

రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డికి కేంద్ర సాహిత్య పురస్కారం!
, శుక్రవారం, 19 డిశెంబరు 2014 (18:23 IST)
ప్రముఖ రచయిత, విమర్శకుడు రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డికి ఈ యేడాదికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 'మన నవలలు - మన కథానికలు' అనే పుస్తకానికి గానూ ఆయనకు ఉత్తమ విమర్శకుడిగా అవార్డు లభించింది. 
 
కాగా, కడప జిల్లాకు చెందిన చంద్రశేఖర్ రెడ్డి అభ్యుదయ సాహిత్య రచయితగా ప్రసిద్ధి చెందారు. ఆయన కలం నుంచి రాయలసీమ సాహిత్యోద్యమాల చరిత్ర, దళిత కథలు, ఆధునికాంధ్ర కవిత్వం జాలువారాయి. ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ప్రకటించడంపై తెలుగు రచయితలు హర్షం వ్యక్తం చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. ఈ అవార్డును తనకు ప్రకటించడంతో తనకు మరింత బాధ్యత పెరిగిందన్నారు. ఇకపై మరింతగా రాయలసీమ సాహిత్యంపై దృష్టిసారించనున్నట్టు ఆయన ప్రకటించారు. 

Share this Story:

Follow Webdunia telugu