Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీజేపీ మిత్రక్షమో.. విపక్షమో అర్థం కావడంలేదు : కేఈ కృష్ణమూర్తి

బీజేపీ మిత్రక్షమో.. విపక్షమో అర్థం కావడంలేదు : కేఈ కృష్ణమూర్తి
, ఆదివారం, 1 మార్చి 2015 (14:12 IST)
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తమకు మిత్రపక్షమో.. లేక విపక్షమో అర్థం కావడం లేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి బీజేపీ అన్యాయం చేసిందని ఆరోపించిన ఆయన రెండు పార్టీల మధ్య మైత్రిపై అనుమానం వ్యక్తం చేశారు. 
 
ఆదివారం విజయవాడలో రిజిస్ట్రేషన్ శాఖాధికారులతో జరిపిన సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తీవ్ర ఆర్థిక లోటుతో ఇబ్బంది పడుతున్న ఏపీ సర్కారు ఆశ, నిరాశల మధ్య కొనసాగుతోందన్నారు. ఈ క్రమంలో ఆదుకోవాల్సిన కేంద్రం అన్యాయం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
 
విభజన చట్టం మేరకు కూడా ఏపీకి న్యాయం చేయడం లేదన్నారు. ఇక ప్రత్యేక హోదా కల్పించే అంశంపై బీజేపీ పిల్లిమొగ్గలు వేస్తోందని విమర్శించారు. గత ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు స్వయంగా హామీలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu