Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేసీఆర్... ! నీకూ హెగ్డే గతే...? రెడీగా ఉండు : మంత్రి పల్లె

కేసీఆర్... ! నీకూ హెగ్డే గతే...? రెడీగా ఉండు : మంత్రి పల్లె
, గురువారం, 30 జులై 2015 (20:14 IST)
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రామకృష్ణ హెగ్డేకు పట్టిన దుర్గతే కేసీఆర్ పడుతుందని ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి రఘునాథరెడ్డి జోస్యం చెప్పారు. ఆ పరిస్థితులను ఎదుర్కోవడానికి ఆయన సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. గురువారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... తమ ప్రభుత్వం పట్ల తెలంగాణ సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
 
ఫోన్ ట్యాపింగ్ విషయంలో తాము చెప్పిందే నిజమైందని మంత్రి పల్లె అన్నారు. ఫోన్లు ట్యాప్ చేయలేదని తెలంగాణ మంత్రులు, అధికారులు చెప్తువచ్చారని... ట్యాపింగ్‌కు పాల్పడినట్టు ఈ రోజు హైకోర్టులో ఒప్పుకున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఫోన్లు ట్యాప్ చేయకూడదని తెలిపారు. స్వప్రయోజనాలు, రాజకీయ లబ్ధికోసం పక్కరాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టడం కోసం ఇదంతా చేశారని ఆరోపించారు. 

Share this Story:

Follow Webdunia telugu