తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ హత్య కేసులో పోలీసులు గాలిస్తున్న ప్రధాన నిందితుడు చింటూ రాయల్ అలియాస్ శ్రీరామ చంద్రశేఖర్ సోమవారం లొంగిపోయాడు. అతడి కోసం పోలీసులు ముమ్మర గాలింపు కొనసాగిస్తున్న తరుణంలో చింటూ నేరుగా చిత్తూరులోని జిల్లా కోర్టుకు వచ్చి సోమవారం లొంగిపోవడం గమనార్హం.
కేసులో సంబంధం ఉందని భావిస్తున్న చింటూ ప్రధాన అనుచరులు ముగ్గురిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెడుతున్న సమయంలోనే చింటూ కోర్టులో లొంగిపోవడం గమనార్హం. చింటూ రాయల్ లొంగుబాటుతో కఠారి మోహన్ దంపతుల కేసు ఓ కొలిక్కి వచ్చినట్లేనన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. కాగా, సొంత మేనత్త అయిన కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్లను చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలోనే కాల్చి చంపిన విషయం తెల్సిందే.