Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్రైమ్ నగర్‌గా కరీంనగర్ : జోరుగా ఐఎస్ఐఎస్ రిక్రూట్‌మెంట్స్!?

క్రైమ్ నగర్‌గా కరీంనగర్ : జోరుగా ఐఎస్ఐఎస్ రిక్రూట్‌మెంట్స్!?
, శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (18:03 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ క్రైమ్ నగర్‌గా మారిపోతోంది. ఈ జిల్లాలో టెర్రరిస్ట్ కార్యకలాపాలు చాపకింద నీరులా విస్తరిస్తున్నట్టు ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా ఈ జిల్లాకు చెందిన పదుల సంఖ్యలో యువత కనిపించకుండా పోతున్నారు. వీరిని అగ్రరాజ్యం అమెరికాను గడగడలాడిస్తున్న ఐఎస్ఐఎస్‌ తమ సంస్థలో చేర్చుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి ఆనవాళ్లుగా కరీంనగర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరగడమే కారణం. 
 
అయితే, జిల్లా నుంచి కనిపించకుండా పోయిన యువత ఆచూకీ గురించి తెలుసుకోవాల్సిన జిల్లా కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం మాత్రం తమకేం పట్టీపట్టనట్టుగా వ్యవహరిస్తోంది. దీంతో ఈ జిల్లాలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోతున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదే పరిస్థితి జరిగిన కరీంనగర్ జిల్లా ఐఎస్ఐఎస్ కార్యకలాపాలకు కేంద్రంగా మారే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu