Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రఘురాం అనే మెడికో ఆత్మహత్య.. తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పి..?

రఘురాం అనే మెడికో ఆత్మహత్య.. తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పి..?
, ఆదివారం, 26 ఏప్రియల్ 2015 (11:28 IST)
రఘురాం అనే మెడికో ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లిలోని కామినేని వైద్య కళాశాలలో పీజీ వైద్య విద్యను అభ్యసిస్తున్న రఘురాం అనే మెడికో.. తాను చదువుతున్న కళాశాలలోని ఓ విద్యార్థినితో ప్రేమలో పడ్డాడని.. అయితే ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. సాధారణంగా ఆత్మహత్య చేసుకునే వారు గుట్టుచప్పుడు కాకుండా, ఎవరూ లేని ప్రదేశం చూసి సూసైడ్ చేసుకుంటారు. 
 
కాని రఘురాం, తాను ఆత్మహత్య చేసుకుంటున్న విషయాన్ని కనిపెంచిన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పి, వారికి తీరని కడుపుకోతను మిగిల్చాడు. ఆదివారం తెల్లవారుజామునే హైదరాబాదులోని వనస్థలిపురంలో ఉంటున్న తల్లిదండ్రులకు ఫోన్ చేసిన రఘురాం, తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఫోన్ పెట్టేశాడు. దీంతో కంగారుపడ్డ అతడి తల్లిదండ్రులు వెనువెంటనే నార్కట్ పల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కూడా వేగంగానే స్పందించారు. అతడు ఉంటున్న అద్దె గదికి పోలీసులు చేరుకునేలోగానే రఘురాం విగత జీవిగా పడి ఉన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu