Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రతిభా పురస్కారాలకు కలాం పేరు... ఏపీ మంత్రివర్గంలో ప్రతిపాదన..

ప్రతిభా పురస్కారాలకు కలాం పేరు... ఏపీ మంత్రివర్గంలో ప్రతిపాదన..
, శుక్రవారం, 31 జులై 2015 (12:11 IST)
విద్యార్థులకు ప్రభుత్వం అందజేసే ప్రతిభా పురస్కారాలకు మాజీ రాష్ట్రపతి కలాం పేరు పెట్టాలని పలువురు మంత్రులు  రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ప్రతిపాదించినట్లు సమాచారం. ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమైన మంత్రి వర్గం తొలుత కలాంకు నివాళులర్పించింది. 
 
విజయవాడలో శుక్రవారం సిఎం క్యాంప్‌ కార్యాలయంలో కొనసాగుతోంది. ఈ కేబినెట్ రాజధాని, గన్నవరం ఎయిర్ పోర్టు, తదితర అంశాలపై చర్చించడానికి సమావేశమయ్యింది. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లాలో నెలకొల్పే ఐఐటీకి మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం పేరు పెట్టాలని, అలాగే ప్రతిభ పురస్కారాలకు కూడా ఆయన పేరు పెడితే సముచితంగా ఉంటుందని పలువురు మంత్రులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి ఆరోగ్యసమస్యల కారణంగా ఉప ముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తి రాలేకపోయారు. 

Share this Story:

Follow Webdunia telugu