Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సహజీవనం చేస్తున్న మహిళపై 17 పోట్లు పొడిచిన వ్యక్తి.. పంది అడ్డంగా రావడంతో?

తనతో సహజీవనం చేస్తున్న మహిళపై చంద్రశేఖర్ అనే వ్యక్తితో దాడి చేశాడు. కాకినాడలోని ఎల్విన్ పేటలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. విచక్షణారహితంగా మొత్తం 17 పోట్లు పొడిచాడు. జరిగిన విషయాన్ని గ్రహించిన చుట్టుపక్

సహజీవనం చేస్తున్న మహిళపై 17 పోట్లు పొడిచిన వ్యక్తి.. పంది అడ్డంగా రావడంతో?
, సోమవారం, 9 జనవరి 2017 (10:02 IST)
తనతో సహజీవనం చేస్తున్న మహిళపై చంద్రశేఖర్ అనే వ్యక్తితో దాడి చేశాడు. కాకినాడలోని ఎల్విన్ పేటలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. విచక్షణారహితంగా మొత్తం 17 పోట్లు పొడిచాడు. జరిగిన విషయాన్ని గ్రహించిన చుట్టుపక్కల వాళ్లు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ దాడికి గల కారణాలు తెలియరాలేదు. 
 
కడప జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇడుపుల పాయ ట్రిపుల్ ఐటీలో అకాడమిక్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న లాల్ బహుదూర్ శాస్త్రి మృతి చెందగా, ఇంగ్లీషు మెంటర్ వెంకటరమణకు తీవ్ర గాయాలయ్యాయి. సొంత పనుల నిమిత్తం వీరిద్దరూ ఆదివారం సాయంత్రం ద్విచక్రవాహనంపై ఇడుపుల పాయ ట్రిపుల్ ఐటీ నుంచి కడపకు వెళ్లారు. పనులు ముగించుకుని వస్తుండగా అర్థరాత్రి సమయంలో చీమలపెంట వద్ద వారి వాహనానికి పంది అడ్డంగా వచ్చింది. 
 
దీనిని తప్పించే క్రమంలో వాహనం అదుపు తప్పడంతో ఇద్దరూ కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో లాల్ బహుదూర్ శాస్త్రి అక్కడికక్కడే మృతి చెందారు. ఈయన స్వస్థలం ఒంగోలు. పులివెందులలో నివాసం ఉంటున్నారు. ఈయన విధుల్లో చేరిన మూడు రోజులకే ఈ సంఘటన జరగడంపై కళాశాలలో విషాదఛాయలు అలముకున్నాయి. క్షతగాత్రుడు వెంకటరమణ స్వస్థలం పీలేరని గుర్తించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమ పేరుతో వంచించాడు.. నేను చెప్పిన వ్యక్తుల వద్దకు వెళ్లాల్సిందే అన్నాడు...