Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎమ్మెల్సీ ఎన్నికలు : జగన్ మోహన్ రెడ్డికి కేటీఆర్ ఫోన్

ఎమ్మెల్సీ ఎన్నికలు : జగన్ మోహన్ రెడ్డికి కేటీఆర్ ఫోన్
, గురువారం, 28 మే 2015 (19:54 IST)
త్వరలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు సపోర్టు చేయాల్సిందిగా వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఫోన్ చేశారు.
 
తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో తమకు మద్దతు పలకాలంటూ జగన్‌ను కేటీఆర్ కోరగా, అందుకు బదులుగా జగన్ స్పష్టమైన వైఖరి వెల్లడించలేదు. ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
 
కాగా, అధికార టీఆర్ఎస్ శాసనమండలి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ పార్టీ వామపక్షాలు, ఎంఐఎం మద్దతు కోరగా, తాజాగా వైకాపా మద్దతును కోరింది.
 
అయితే, ఆయా పార్టీలు తమ వైఖరిని వెల్లడించాల్సి ఉంది. కాగా, మండలిలో తమ వారినే గెలిపించుకునేందుకు టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడుతోందని గత కొన్ని రోజులుగా టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. దీనిపై టీడీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.

Share this Story:

Follow Webdunia telugu