Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మా అన్న చాలా మంచోడు.. రైతులు అడిగితేనే కాల్వకు గండి కొట్టాం : జేసీ ప్రభాకర్ రెడ్డి!

మా అన్న చాలా మంచోడు.. రైతులు అడిగితేనే కాల్వకు గండి కొట్టాం : జేసీ ప్రభాకర్ రెడ్డి!
, బుధవారం, 1 ఏప్రియల్ 2015 (14:42 IST)
మా అన్న, టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చాలా మంచోడనీ, రైతులు వచ్చి అడిగితేనే పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు గండి వేశారనీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ బ్రాంచ్ కెనాల్‌కు గండి కొట్టిన విషయం ఇపుడు పెద్ద వివాదాస్పదమైన విషయం తెల్సిందే. ఈ విషయంపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసి, వెంటనే తనను వచ్చి కలవాలని ఆదేశించారు. 
 
ఈ నేపథ్యంలో ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ తాగునీటి కోసం రెండు (అనంతపురం, కడప) జిల్లాల రైతులు అడిగితేనే జేసీ దివాకర్ రెడ్డి పులివెందుల బ్రాంచ్ కెనాల్ వద్దకు వెళ్లారని వివరణ ఇచ్చారు. చిత్రావతిలోకి నీళ్లు వదలడం ద్వారా పల్లెజనం దప్పిక తీరిందన్నారు. పులివెందులకు 5 టీఎంసీల నీళ్లు కావాలా? అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడు పిలిచినా వెళ్లి మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటిచారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో రవాణా రంగం కుదేలైపోతుందని, ఈ విషయంపై హైకోర్టులో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu