Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మరో 6 నెలల తర్వాత జగన్ పార్టీ ఉండదు: జేసీ జోస్యం

మరో 6 నెలల తర్వాత జగన్ పార్టీ ఉండదు: జేసీ జోస్యం
, శనివారం, 20 సెప్టెంబరు 2014 (19:12 IST)
మరో 6 నెలల తర్వాత జగన్‌కు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉండదని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి జోస్యం చెప్పారు.  హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు పూర్తయితే లాభపడేది రాయలసీమేనని అన్నారు. మాగంటి బాబుపై దాడి చేసి తిరిగి ఆయనపైనే కేసులు పెట్టారని ఆయన విమర్శించారు. 
 
కుక్కనూరులో కలెక్టర్ పర్యటనను వైఎస్సార్సీపీ నేతలు ఎందుకు అడ్డుకున్నారని జేసీ ప్రశ్నించారు. ముంపు మండలాల విషయంలో టీఆర్ఎస్సే మాట్లాడడం లేదని, అలాంటప్పుడు వైఎస్సార్సీపీకి ఎందుకని జేసీ నిలదీశారు. మరో ఆరు నెలల్లో జగన్ ఏకాకి కావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu