Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్‌తో కరచాలనం చేశా.. వైకాపాలో చేరానని బ్రేకింగ్ న్యూస్ వేస్తారా?: మీడియాతో జేసీ దివాకర్

జగన్‌తో కరచాలనం చేశా.. వైకాపాలో చేరానని బ్రేకింగ్ న్యూస్ వేస్తారా?: మీడియాతో జేసీ దివాకర్
, బుధవారం, 24 ఫిబ్రవరి 2016 (18:33 IST)
పార్లమెంట్ ప్రాంగణంలో బుధవారం అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ఢిల్లీలో ఉన్న వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి, టీడీపీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిలు అనుకోని విధంగా తారస పడ్డారు. ఆ సమయంలో ఒకరికొకరు మర్యదపూర్వకంగా పలకరించుకున్నారు. 
 
అంతేకాకుండా జేసీ మరో అడుగు ముందుకేసి జగన్‌తో ఆసక్తికరంగా మాట్లాడుతూ పక్కనే ఉన్న ఫొటోలకు ఫోజులిచ్చారు. అనంతరం అక్కడే ఉన్న మీడియా సిబ్బందితో జేసీ దివాకర్‌రెడ్డి వైసీపీలో చేరారని వార్తలిస్తారా అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. 
 
కాగా, బుధవారం జేసీ దివాకర్‌రెడ్డి పుట్టినరోజు కావడంతో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి బర్త్‌డే విషెస్ చెప్పారు. 'హ్యాపీ బర్త్ డే' అన్న అంటూ సుబ్బారెడ్డి అన్నారు. దీనికి జేసీ స్పందిస్తూ ముందు మీరు హ్యాపీగా ఉండండని చమత్కరించారు.
 
మరోవైపు.. బుధవారం కూడా జగన్‌కు సొంత పార్టీ ఎమ్మెల్యే ఒకరు షాకిచ్చిన విషయం తెల్సిందే. జగన్ సొంత జిల్లా కడప పరిధిలోని బద్వేల్ శాసనసభ్యుడు జయరాములు సైకిలెక్కారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పసుపు చొక్కా తొడుక్కున్నారు. అదేసమయంలో జగన్ ఇలాఖాలోని మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్టు వార్తలు వస్తుండటం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu