Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అనంతలో ఏపీ రాజధాని ఏర్పాటు కాదు: ఎంపీ జేసీ

అనంతలో ఏపీ రాజధాని ఏర్పాటు కాదు: ఎంపీ జేసీ
, శనివారం, 26 జులై 2014 (16:39 IST)
అనంతపురంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏర్పాటు కాదని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా పర్యాటక రంగ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి రూ.11 కోట్ల నిధులు మంజూరైనట్లు జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఆశీస్సులతో ఏపీ అభివృద్ధి సాధ్యమవుతుందన్న దివాకర్ రెడ్డి, కేంద్రం సహకారంతో అనంతపురం జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటవుతాయని చెప్పారు. కానీ రాజధాని ఏర్పాటు మాత్రం సాధ్యం కాదన్నారు.
 
ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును చైనా పారిశ్రామికవేత్తలు కలిశారు. హైదరాబాదులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌లో చంద్రబాబుతో సమావేశమైన చైనా బృందం ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధమని చెప్పారు. అలాగే, చైనాలోని తమ పరిశ్రమలను సందర్శించేందుకు చైనా రావాల్సిందిగా వారు ముఖ్యమంత్రికి విన్నవించారు.

Share this Story:

Follow Webdunia telugu