Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇదేం కరువు పరిశీలన? అంచనా ఎలా వేయగలుగుతారు? జేసీ ప్రభాకర్ రెడ్డి

ఇదేం కరువు పరిశీలన? అంచనా ఎలా వేయగలుగుతారు? జేసీ ప్రభాకర్ రెడ్డి
, గురువారం, 2 ఏప్రియల్ 2015 (12:16 IST)
కరువు పరిశీలన అంటే ఇలాగేనా... ఇలా వచ్చి అలా వెళ్లితే తెలిసేదేమిటి? అరగంటైనా కూర్చుని మాట్లాడితే విషయం తెలుస్తుంది. అలా కాకుండా ఇలా వాహనాల్లో వచ్చి, అలా ఐదు నిమిషాలు నిలబడి చూసి వెళ్లినంత మాత్రనా కరువు పరిశీలన అయిపోతుందా..? అని జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన అనంతపురం జిల్లాలో విలేకరులతో మాట్లాడారు. 
 
కేంద్ర వ్యవసాయశాఖ జాయింట్ సెక్రటరీ పి.షకీల్‌అహ్మద్ నేతృత్వంలో డీఏసీ జేడీ నరేంద్రకుమార్, మానిటరింగ్ అండ్ అప్రైసర్ డెరైక్టరేట్ డెరైక్టర్ పంకజ్‌త్యాగి, ఫుడ్‌కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ఏపీ రీజియన్ డీజీఎం గోవర్థన్‌రావులతో కూడిన బృందం బుధవారం అనంతపురంలో పర్యటించిన విషయం తెలిసిందే
 
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం రావివెంకటాంపల్లిలో కేవలం 5 నిమిషాలే పర్యటించడంపై గురువారం ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కరవు అంచనా వేసేది ఇలాగేనా? అంటూ ప్రశ్నించారు. ఇలాగైతే ఏం అంచనా వేయగలుగుతారని ఆవేదన వ్యక్తం చేశారు.  కరవు బృందం పర్యటనతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని వ్యాఖ్యానించారు.
 

Share this Story:

Follow Webdunia telugu