వైసీపీ ఎమ్మెల్యేలతోనే జగన్ని తిట్టించే స్కీమ్... జగన్తో ఢిల్లీ వెళ్లిన ఎమ్మెల్యేలు 7గురు జంపా...?
చంద్రబాబు అవినీతి మహారాజని వైసీపీ వేసిన పుస్తకంపై టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. వారు జగన్ మోహన్ రెడ్డిని తిట్టడం కంటే ఇటీవల వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన ఎమ్మెల్యేలతో తిట్టిస్తే బాగుంటుందని అనుకున్నారో ఏమో... ఇటీవల ఫిరాయించిన ఎమ్మెల్యేలతో
చంద్రబాబు అవినీతి మహారాజని వైసీపీ వేసిన పుస్తకంపై టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. వారు జగన్ మోహన్ రెడ్డిని తిట్టడం కంటే ఇటీవల వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన ఎమ్మెల్యేలతో తిట్టిస్తే బాగుంటుందని అనుకున్నారో ఏమో... ఇటీవల ఫిరాయించిన ఎమ్మెల్యేలతో మీడియా సమావేశాన్ని విజయవాడలో ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు జలీల్ ఖాన్, గొట్టిపాటి రవికుమార్, ఆమంచి కృష్ణమోహన్, దామచర్ల జనార్ధన్ తదితరులు మాట్లాడుతూ, అవినీతి జగన్ చంద్రబాబుపై పుస్తకం వేయడం సిగ్గు చేటని విమర్శించారు.
జగన్ డబ్బు తిని, అవినీతి చేసి ఇప్పుడు అవినీతి పుస్తకం చంద్రబాబు మీద రాయడం చాలా సిగ్గుచేటు అని జలీల్ ఖాన్ మండిపడ్డారు. జగన్కు తన ఎమ్మెల్యేల పైనే నమ్మకం లేదని... అందుకే ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. జగన్తో ఢిల్లీ వెళ్ళిన ఎమ్మెల్యేలలో ఏడుగురు త్వరలో టీడీపీలో చేరతారని జలీల్ చెప్పారు.
చంద్రబాబు లక్ష కోట్లు దోచుకున్నారని జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తెలిపారు. ప్రతిపక్ష నేతగా జగన్ అసమర్థతను ప్రజలు గుర్తించారని ఆయన చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికలలో వైసీపీకి డిపాజిట్లు రావని... సీఎం పదవి జగన్కు కలగానే మిగిలిపోతుందని జలీల్ ఖాన్ ఎద్దేవా చేశారు.