Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా రాజకీయం హీరోలా ఉంటుంది.. చంద్రబాబు రాజకీయం విలన్‌లా ఉంటుంది.. జగన్

గుండెపోటుతో మరణించిన భూమా నాగిరెడ్డి గురించి సభలో చెప్పాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే సభకు వెళ్లలేదని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాము సంతాప తీర్మానానికి హాజరైతే భూమా నాగిరెడ్డి మంచితో పాటు త

నా రాజకీయం హీరోలా ఉంటుంది.. చంద్రబాబు రాజకీయం విలన్‌లా ఉంటుంది.. జగన్
, మంగళవారం, 14 మార్చి 2017 (13:11 IST)
గుండెపోటుతో మరణించిన భూమా నాగిరెడ్డి గురించి సభలో చెప్పాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే సభకు వెళ్లలేదని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాము సంతాప తీర్మానానికి హాజరైతే భూమా నాగిరెడ్డి మంచితో పాటు తప్పులు కూడా చెప్పవలసి వస్తుందని, అందుకే హాజరు కాలేదని వివరణ ఇచ్చారు. భూమా నాగిరెడ్డి సంతాప తీర్మానానికి వైసీపీ హాజరుకాలేదు. 
 
దీనిపై మీడియాతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. చనిపోయిన వ్యక్తి గురించి చెడు చెప్పడం ఎందుకని సభకు వెళ్లలేదన్నారు. భూమా చనిపోయిన 24 గంటల్లోనే అఖిలను అసెంబ్లీకి తీసుకు రావడం ఏమిటని ప్రశ్నించారు. ఇదేం సంస్కారం అంటూ ప్రశ్నించారు. భూమాకు మంత్రి పదవి ఇవ్వకుండా మానసిక క్షోభకు గురి చేశారన్నారు. పార్టీ మారితే మంత్రి పదవి ఇస్తానని బాబు ఆశ పెట్టారన్నారు. 
 
తన రాజకీయం హీరోలా ఉంటుందని.. చంద్రబాబు రాజకీయం విలన్‌లా ఉంటుందని చెప్పారు. నంద్యాలసీటు మాదేనని.. ఉప ఎన్నికల్లో కచ్చితంగా పోటీకి పెడతామని తేల్చి చెప్పారు. సంతాప సమయంలోను రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. భూమా నాగిరెడ్డి మృతి చెందాడని తెలిసి చాలా బాధపడ్డానని చెప్పారు. అఖిల ప్రియతో ఫోన్లో మాట్లాడానని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భూమా నాగిరెడ్డితో చంద్రబాబు చేయించిన తప్పులు చెప్పాల్సి వస్తుందనే వెళ్లలేదు : వైఎస్. జగన్