Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అధికారం కోసం గడ్డి తినం: చంద్రబాబుపై జగన్ ఫైర్!

అధికారం కోసం గడ్డి తినం: చంద్రబాబుపై జగన్ ఫైర్!
, శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (14:53 IST)
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విపక్ష నేత వై.ఎస్.జగన్ విమర్శల వర్షం కురిపించారు. రెండో రోజు అనంతపురంలో సమీక్ష సమావేశాలలో ఆయన మాట్లాడుతూ అధికారం కోసం ఏ గడ్డైనా తినే పద్ధతి మంచిది కాదని దుయ్యబట్టారు. 
 
సీఎం పదవి కోసం మోసం చేయాల్సిన అవసరం లేదని జగన్ వ్యాఖ్యానించారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ తానే చెల్లిస్తానని అనడం సిగ్గుచేటు అన్నారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారని, లేని వడ్డీని ఎలా కడతారని, దానిని చంద్రబాబు చెప్పాలని జగన్ కోరారు. 
 
రైతుల రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు ఎలా తప్పించుకోవాలా అని చూస్తున్నారని, పైగా టిడిపి నేతలు బాబు మంచోడే, కేంద్రం, రిజర్వు బ్యాంకు చెడ్డవన్నట్లుగా మాట్లాడుతున్నారని జగన్ ధ్వజమెత్తారు.

Share this Story:

Follow Webdunia telugu