Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పరిటాల రవి హత్య కేసు : సందేహం ఉంటే విచారణ.. జేసీ

పరిటాల రవి హత్య కేసు : సందేహం ఉంటే విచారణ.. జేసీ
, మంగళవారం, 19 ఆగస్టు 2014 (16:16 IST)
పరిటాల రవి హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఒక వేళ తనపై ఇంకా సందేహం ఉన్నా మరోమారు విచారణ జరిపించుకోవచ్చని అనంతపురం టీడీపీ ఎంపీ, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలోని టీడీఎల్పీ కార్యాలయం వద్ద ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
తనపై గతంలోనే విచారణ చేశారని... అవసరమనుకుంటే మరోసారి విచారణకు తాను సిద్ధమని చెప్పారు. వైకాపా అధినేత జగన్ తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పరిటాల రవి హత్యతో తనను ముడిపెట్టేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.
 
కాగా... హత్యారాజకీయాలపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చకు అనుమతించాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు వైకాపా సభ్యులు మంగళవారం నోటీసు ఇచ్చారు. ప్రశ్నోత్తరాలు కొంచెం సేపు జరిగిన తర్వాత... తాము ఇచ్చిన నోటీసుకు అనుగుణంగా రాష్ట్రంలోని శాంతి భద్రతలపై చర్చకు అనుమతివ్వాలని వైకాపా సభ్యులు స్పీకర్‌ను డిమాండ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu