Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పరీక్ష పెయిల్ అయ్యిందని.. విద్యార్థిని ఆత్మహత్య

పరీక్ష పెయిల్ అయ్యిందని.. విద్యార్థిని ఆత్మహత్య
, సోమవారం, 27 ఏప్రియల్ 2015 (09:09 IST)
పరీక్ష తప్పిందని ఓ విద్యార్థి మనస్తాపానికి గురయ్యింది. తన ప్రాణాల మీదికే తెచ్చుకుంది. క్షణికావేశంలో  నిలువెల్లా తన నిండుప్రాణాన్ని తీసేసుకుంది. ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నెల్లూరు జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట రాజగోపాలపురానికి చెందిన పి. ఇందుమతి (17) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంది. మూడు రోజుల కిందట విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఓ సబ్జెక్టులో తప్పింది.  అప్పటి నుంచే దిగులుగా కనిపిస్తోంది. తన తీవ్ర ఆవేదనతో ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 
 
దీంతో తీవ్ర ఆవేదన చెందిన ఇందుమతి.. ఇంట్లో ఎవరూ లేనిసమయంలో ఉరి వేసుకుంది. కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూసే సరికి ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. ఎస్ ఆంజనేయరెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu