Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్వర్ణ దేవాలయంలో కత్తుల యుద్ధం.. 12 మందికి గాయాలు!

స్వర్ణ దేవాలయంలో కత్తుల యుద్ధం.. 12 మందికి గాయాలు!
, శుక్రవారం, 6 జూన్ 2014 (12:26 IST)
పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్‌లో ఉన్న స్వర్ణ దేవాలయంలో శిరోమణి అకాలీదళ్ కార్యకర్తలకు, ఆలయ భద్రతా సిబ్బందికి మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఫలితంగా ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. ఈ ఘర్షణల్లో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 
 
ఈ వివాదాన్ని సద్దుమణించేందుకు సిక్కు మతపెద్దలు ప్రయత్నించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 'ఆపరేషన్ బ్లూ స్టార్' ఘటన జరిగి ముప్పై ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణ దేవాలయంలో ప్రత్యేక ప్రార్ధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆలయ టాస్క్ ఫోర్స్, శిరోమణి అకాళీదళ్ కార్యకర్తలు మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఆలయంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu