Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానం గల్లంతు... 8 మంది విశాఖ వాసులు

శుక్రవారం నాడు చెన్నై తాంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్ వెళుతున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్)కు చెందిన విమానం అదృశ్యమైంది. ఐఏఎఫ్‌కు చెందిన ఎఎన్-32 అనే విమానం శుక్రవారం ఉదయం ఆచూకీ తెలియకుండా పోయింది. చెన్నై తాంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్‌కు ఉదయం 08.30 గంటలక

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానం గల్లంతు... 8 మంది విశాఖ వాసులు
, శుక్రవారం, 22 జులై 2016 (18:32 IST)
శుక్రవారం నాడు చెన్నై తాంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్ వెళుతున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్)కు చెందిన విమానం అదృశ్యమైంది. ఐఏఎఫ్‌కు చెందిన ఎఎన్-32 అనే విమానం శుక్రవారం ఉదయం ఆచూకీ తెలియకుండా పోయింది. చెన్నై తాంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్‌కు ఉదయం 08.30 గంటలకు బయల్దేరింది. అక్కడ ఉదయం 11.20 గంటలకు ల్యాండ్ కావాల్సిన ఈ విమానం ఆచూకీ తెలియట్లేదని ఐఏఎఫ్ అధికారులు తెలిపారు. 
 
29 మంది ప్రయాణికులతో ఈ విమానం బయల్దేరింది. కానీ బయల్దేరిన 15 నిమిషాలకే చెన్నై ఎయిర్ పోర్టులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో విమానం బంగాళాఖాతంలో కూలిపోయి ఉండవచ్చునని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
 
విమానం కోసం ఐదు యుద్ధనౌకలు, రెండు ఎయిర్‌ఫోర్స్ విమానాలు సముద్ర జలాల్లోకి గాలింపు చర్యల నిమిత్తం బరిలో దిగాయి. వీటిలో ఐదు నౌకలతో పాటు 13 ఫుల్ స్పీడ్ పడవలను కూడా పంపారు. కాగా ఎఎన్-32 రకానికి చెందిన విమానాలు చాలా బరువుతో పాటు బలంతో ఉంటాయి. పర్వతాలు, ఎడారుల్లో ఈ ఫ్లైట్ అధికంగా సంచరిస్తుంది. ఈ విమానంలో విశాఖకు చెందిన 8 మంది వాయుసేన సిబ్బంది ఉన్నట్లు వారివారి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ స్పెషల్ స్టేటస్ బిల్లుపై ఓటింగ్.. 150 సినిమాకు చిరంజీవి పేకప్.. ఢిల్లీకి పరుగో పరుగు!