Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డోంట్ వర్రీ.. వర్షాలు కురుస్తున్నాయ్: వాతావరణ శాఖ నిపుణులు

డోంట్ వర్రీ.. వర్షాలు కురుస్తున్నాయ్: వాతావరణ శాఖ నిపుణులు
, గురువారం, 6 ఆగస్టు 2015 (19:22 IST)
తెలుగు రాష్ట్రాల్లో రైతులు భయపడాల్సిన అవసరం లేదని.. ఈ ఏడాది దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ నిపుణులు నర్సింహారావు తెలిపారు. అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితేనే రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని నర్సింహారావు స్పష్టం చేశారు.
 
దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 6 శాతం మాత్రమే వర్షపాతం నమోదైందని, ఈ నెలలో 10 శాతం తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇక తెలంగాణలో సాధారణం కంటే 26 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్టు వెల్లడించారు. 
 
తెలంగాణలోని 10 జిల్లాల్లో ఏడు జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉందన్నారు. కోస్తాంధ్రలో సాధారణం కంటే 11 శాతం ఎక్కువ వర్షపాతం ఉన్నా, నెల్లూరు జిల్లాలో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైందని నర్సింహారావు వివరించారు. ఇటు రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో కూడా సాధారణ వర్షపాతం నమోదైందని ఆయన తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu