Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మీ కాళ్లను పళ్లెంలో పెట్టి పాదపూజ చేస్తా చంద్రబాబుగారూ... ముద్రగడ

మీ కాళ్లను పళ్లెంలో పెట్టి పాదపూజ చేస్తా చంద్రబాబుగారూ... ముద్రగడ
, సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (14:11 IST)
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు కాపులను బీసీల్లో చేర్చిన మరునాడు నేను, నా భార్యతో కలిసి సీఎం ఇంటికి వెళ్లి ఆయన కాళ్లను పళ్లెంలో ఉంచి పాదపూజ చేస్తానని కాపు రిజర్వేన్లపైన దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. రిజర్వేన్ల ప్రక్రియ 7 నెలల లోపే ముగించి న్యాయం చేస్తామని ఇచ్చిన హామీని మేము నమ్ముతున్నట్లు తెలియజేశారు. ఇంకా ముద్రగడ మాట్లాడుతూ... ''ఆకలి తట్టుకోలేక కేకలు వేశాము తప్పించి ఆగ్రహంతో కాదు. 
 
కాపులను బీసీల్లో చేర్చుతామని సీఎం గారు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. వెనుకబడిన తరగతుల వారి నోటి దగ్గర అన్నం లాక్కోము. ఇప్పటికే బీసీలుగా ఉన్నవారికి అన్యాయం చేయమని మేము అడుగబోము. వారికి కేటాయించిన రిజర్వేన్లు పోను మాకు కేటాయించండి. కాపుల ఆకలి తీర్చాలని మాత్రమే రోడ్డెక్కాము. ఈ సమయంలో అనరాని మాటలు అనివుంటే మమ్మల్ని క్షమించండి. రాష్ట్రవ్యాప్తంగా కాపు సోదరులంతా దీక్ష విరిమించండి. 
 
ముఖ్యమంత్రిగారు కాపు రిజర్వేషన్ల విషయంలో సానుకూలంగా స్పందించారు. రఘువీరా రెడ్డిగారి మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు. రిజర్వేషన్లు ఆలస్యం కావడం వల్లనే దీక్షకు దిగాను తప్పించి ముఖ్యమంత్రిని నిందించాలని నా ఉద్దేశం కాదు" అని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu