ఆస్ట్రేలియాలో హైదరాబాద్కు చెందిన ఓ యువతి అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కూకట్పల్లికి చెందిన రమ్యకృష్ణకి నాలుగు నెలల క్రితం ఆస్ట్రేలియాకు చెందిన మహంత్తో అనే యువకుడితో పెద్దలు అంగరంగవైభవంగా వివాహం జరిపించారు. అయితే, రెండు రోజుల క్రితం ఆమె చనిపోయినట్లు మహంత్... రమ్యకృష్ణ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
శుక్రవారం రాత్రి విమానంలో ఆమె మృతదేహం హైదరాబాద్లోని కూకట్పల్లికి చేరుకుంది. కుటుంబ సభ్యులు, రమ్యను అదనపు కట్నం కోసం భర్తే చంపాడని ఆరోపిస్తున్నారు. మహంత్ను కఠినంగా శిక్షించాలంటూ రమ్య బంధువులు ఆందోళనకు దిగారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.