తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వేలో విజయవాడ పార్లమెంట్ మాజీ సభ్యుడు లగడపాటి రాజగోపాల్, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొనలేదు. ఈ సర్వే కోసం ఎన్యుమరేటర్లు లగడపాటి ఇంటికి వెళ్లగా, ఆ సమయంలో ఇంటికి తాళం వేసివుండటంతో వారు వెనుదిరిగి పోయారు.
తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం మంగళవారం సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాదులోని కుందన్బాగ్ ఆఫీసర్స్ కాలనీలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తన వివరాలు నమోదు చేయించుకున్నారు. అలాగే జీహెచ్ఎంసి కమిషనర్ సోమేష్ కుమార్ రాజేంద్రనగర్లో ఎన్యుమరేటర్లకు వివరాలు ఇచ్చారు.