వీకెండ్ పార్టీలో రభస... అమెరికాలో తెలుగు విద్యార్థి హత్య.. ప్రాణస్నేహితుడి హంతకుడు!
అమెరికాలో ఓ తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. ప్రాణస్నేహితుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే హైదరాబాద్ కాచిగూడకు చెందిన సంకీర్త్ అనే యువకుడు ఎంఎస్ చే
అమెరికాలో ఓ తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. ప్రాణస్నేహితుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే హైదరాబాద్ కాచిగూడకు చెందిన సంకీర్త్ అనే యువకుడు ఎంఎస్ చేసేందుకు రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. ఇటీవలే లక్కీ డ్రాలో హెచ్-1 బి వీసాను పొంది నార్త్ ఆస్టిన్లో ఉంటూ ఎంఎస్ చదువుతున్నాడు. అతనికి సాయి సందీప్ గౌడ్ (27) అనే స్నేహితుడు ఉన్నాడు. వీరిద్దరు వీకెండ్ పార్టీలకు వెళ్లి జల్సాలు చేయడం రివాజుగా జరుగుతోంది. పైగా వీరిద్దరు ఒకే రూమ్లో నివశిస్తున్నాడు.
ఈ క్రమంలో వీరిద్దరు కలిసి వీకెండ్ పార్టీకి వెళ్లారు. అక్కడ జరిగిన గొడవ కారణంగా సంకీర్త్ హత్యకు గురయ్యాడు. సంకీర్త్ను హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని రహస్యంగా తరలించేందుకు సందీప్ ప్రయత్నించాడు. ఓ కారులో మృతదేహాన్ని తరలిస్తుండగా గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
దీనిపై స్పందించిన పోలీసులు... హంతకుడు సందీప్ గౌడ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అసలేం జరిగిందని వివరాలు సేకరిస్తున్నారు. కాగా, సంకీర్త్ మృతి వార్త విన్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నార్త్ ఆస్టిన్ లోని కలోనియల్ విలేజ్లో ఉన్న క్వారీ ఓక్స్ అపార్ట్మెంట్లో ఈ ఘటన జరిగింది.