Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కిడ్నీ రాకెట్: నలుగురిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు!

కిడ్నీ రాకెట్: నలుగురిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు!
, మంగళవారం, 17 ఫిబ్రవరి 2015 (18:29 IST)
హైదరాబాద్ పోలీసులు కిడ్నీ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి డబ్బులు ఎరవేసి, వారి కిడ్నీలను కాజేస్తున్న నలుగురు నేరగాళ్లను పోలీసులు సోమవారం అరెస్టు చేసి, మీడియా ముందు ప్రవేశ పెట్టారు. నిందితుల నుండి తొమ్మిది పాస్ పోర్టులు, వైద్య పరీక్షల రిపోర్టులు, ఓ కంప్యూటర్, ప్రింటర్, ల్యాప్‌టాప్‌లు, ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు
 
ఏడాదికాలంగా ఇది సీక్రెట్‌గా జరుగుతున్న ఈ వ్యవహారం..  ఫేస్‌బుక్ ద్వారా సమాచారం అందడంతో పశ్చిమ మండల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి హైదరాబాదులో ఉంటున్న రాఘవేందర్, అశోక్, సంజయ్ కుమార్ జైన్, షిర్డీ వైద్యుడు హిర్దేశ్ సక్సేనాలను అరెస్టు చేశారు. 
 
ఆదివారం రాత్రి వీరంతా హైదరాబాదులోని ఎల్లారెడ్డిగూడలో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తాము పదిమంది నుండి మూత్రపిండాలు తీసుకున్నామని చెప్పారు. మరో ఎనిమిది మందితో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu