Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'సారీ మమ్మీ, సారీ డాడీ..' అంటూ కొత్త పెళ్లి కుమారుడు సూసైడ్.. ఎందుకంటే...?

బెట్టింగ్ కొత్త పెళ్లి కుమారుడి ప్రాణాలు తీసింది. క్రికెట్ బెట్టింగ్ మోజులో పడి భార్యాబంగారాన్ని కూడా పోగొట్టుకున్న కొత్త పెళ్లికుమారుడు.. ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన హైదరాబాద్‌లోని స్థానిక బ

'సారీ మమ్మీ, సారీ డాడీ..' అంటూ కొత్త పెళ్లి కుమారుడు సూసైడ్.. ఎందుకంటే...?
, శుక్రవారం, 9 జూన్ 2017 (11:07 IST)
బెట్టింగ్ కొత్త పెళ్లి కుమారుడి ప్రాణాలు తీసింది. క్రికెట్ బెట్టింగ్ మోజులో పడి భార్యాబంగారాన్ని కూడా పోగొట్టుకున్న కొత్త పెళ్లికుమారుడు.. ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన హైదరాబాద్‌లోని స్థానిక బాపూజీనగర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... ఘనశ్యామ్ (27) అనే యువకుడు బాపూజీనగర్‌లో కిరాణా దుకాణం నిర్వహిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో వివాహం జరిగింది. అయితే, క్రికెట్ బెట్టింగ్‌కు అలవాటుపడిన ఘనశ్యామ్ ఎంతో నష్టపోయాడు. చివరకు, తన భార్యకు చెందిన 28 తులాల బంగారు నగలను కూడా బెట్టింగ్‌లో ఫణంగా పెట్టి మొత్తం బంగారాన్ని కోల్పోయాడు. 
 
దీంతో, తీవ్ర మనస్తాపం చెందిన ఘనశ్యామ్, కుటుంబసభ్యులందరూ నిద్రిస్తున్న సమయంలో, గురువారం రాత్రి తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, అతను రాసిన సూసైడ్ నోట్ లభించింది. ‘సారీ మమ్మీ, సారీ డాడీ..’ అని ఆ లేఖలో రాసి ఉంది. 
 
సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, అతన్ని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాదులో బోర్డు తిప్పేసిన 4 ఐటీ కంపెనీలు.. యాహూ ఉద్యోగులకు చేదు వార్త