Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భార్యను చంపేందుకు 19 నాటు బాంబులు తయారు చేసిన భర్త.. ఎక్కడ?

భార్యను చంపేందుకు 19 నాటు బాంబులు తయారు చేసిన భర్త.. ఎక్కడ?
, సోమవారం, 31 ఆగస్టు 2015 (12:32 IST)
సాధారణంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉంటాయి. ఇవి తారా స్థాయికి చేరినపుడు ఒకరినొకరు చంపుకునేందుకు ఒకరికి తెలియకుండా మరొకరు కుట్ర పన్నుతుంటారు. అదేవిధంగా ఓ భర్త తన భార్యను చంపేందుకు ఏకంగా 19 నాటు బాంబులను తయారు చేశాడు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
నెల్లూరు జిల్లా పొదలకూరుకు చెందిన శ్రీధర్ రెడ్డి, భార్య రమాదేవిల మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో వీరిద్దరు నాలుగేళ్ళ క్రితం విడిపోయారు. దీంతో రమాదేవి ఇదే జిల్లాలోని బుచ్చిరెడ్డి పాళెంలో నివశిస్తూ వస్తోంది. ఈపరిస్థితుల్లో తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు శ్రీధర్ రెడ్డి అనుమానించాడు. 
 
దీంతో రమాదేవి ఇంట్లో ఉండగా తలుపు గెడ వేసి... ఇంటి చుట్టూ పెట్రోల్‌ పోశాడు. ఇంటికి నిప్పు పెట్టి తన దగ్గరున్న నాటు బాంబుల్ని ఇంటిపై వేయాలనుకున్నాడు. తన భర్త కుట్రను పసిగట్టిన రమాదేవి పోలీసులకు ఫోన్ చేయడంతో సీన్ రివర్సైంది. పోలీసులు శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. భార్యను హత్య చేసేందుకే ఈ బాంబులను తయారు చేసినట్టు విచారణలో వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu