Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పరువు కోసం కన్నకూతుర్నే చంపేసిన తల్లిదండ్రులు.. ఎక్కడ?

పరువు కోసం కన్నకూతుర్నే చంపేసిన తల్లిదండ్రులు.. ఎక్కడ?
, మంగళవారం, 24 మే 2016 (11:27 IST)
పరువు హత్యలు మన రాష్ట్రంలోనూ పెరిగిపోతున్నాయి. ప్రేమించిన పాపానికి తల్లిదండ్రులే కన్నకూతుర్ని గొంతు నులిమి హత్య చేశారు. ఈ ఘటన కోలారు జిల్లా శ్రీనివాసపుర తాలుకా తమటంపల్లిలో చోటుచేసుకుంది. తక్కువ కులానికి చెందిన యువకుడిని ప్రేమించిని పాపానికి సమాజంలో తమ పరువును కాపాడుకునేందుకు కన్నవాళ్లే కాలయముళ్లుగా మారిపోయారు. 
 
వివరాల్లోకి వెళితే.. తమటంపల్లికి చెందిన ప్రియారెడ్డి (17) అదే గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమించింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నకూతురిని వద్దని వారించారు. అయితే దొంగచాటుగా ప్రియుడిని కలిసేందుకు వెళ్ళిన ప్రియారెడ్డి.. అతనితోనే పారిపోతుందనే భయంతో తండ్రి బైరవరెడ్డి, తల్లి, సోదరుడు కలిసి ఆ యువతిని గొంతునులిమి చంపేశారని పోలీసులు తెలిపారు. ఇక నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జపాన్‌లో దారుణం.. పాప్ స్టార్‌ను 20 సార్లు కత్తితో పొడిచి కిరాతకంగా చంపేసిన అభిమాని!!