Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భానుడు భగభగ... ఏపీలో 391, తెలంగాణలో 251 మంది ఒక్కరోజులో మృతి

భానుడు భగభగ... ఏపీలో 391, తెలంగాణలో 251 మంది ఒక్కరోజులో మృతి
, ఆదివారం, 24 మే 2015 (10:29 IST)
తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలో పడినట్టున్నాయి. ఎండలు తీవ్రరూపం దాల్చడంతో ఆకులు రాలినట్టు ప్రజల ప్రాణాలు రాలిపోతున్నాయి. ఇరు రాష్ట్రాలలో శనివారం ఒక్కరోజులోనే 642 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఆంధ్రాకు చెందిన వారు 391 మంది కాగా, తెలంగాణ ప్రజలు 251 మంది. వడగాలుల తీవ్రతతో అన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రత నమోదవుతోంది. నిజామాబాద్, రామగుండం తదితర చోట్ల 48 డిగ్రీల వేడి నమోదైంది. 
 
కాగా, ఇంతటి ఎండలో బయట తిరగడం అత్యంత ప్రమాదమని, తప్పనిసరైతే మాత్రమే తగు జాగ్రత్తలు తీసుకుని బయటకు వెళ్లాలని అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. ఎండలో పనిచేసేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరో వారం రోజుల పాటు ఇదే విధమైన పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu