తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ గళం విప్పారు. ముసునూరు ఎమ్మార్వో వనజాక్షికి మద్దతుగా నిలిచారు. ఆమెను బెదిరించిన దోషులు ఎంతటి వారైనా శిక్షించాలని అన్నారు. వనజాక్షికి అండగా ఉంటామని మంగళవారం ఆయన ప్రకటించారు.
నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు కారణమైనవారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వారు ఎంతటివారైనా సరే వదిలిపెట్టకూడదని ఆయన అన్నారు.