Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హంద్రినీవాను మేం పూర్తి చేస్తాం : బాలకృష్ణ - దేవినేని

హంద్రినీవాను మేం పూర్తి చేస్తాం : బాలకృష్ణ - దేవినేని
, సోమవారం, 2 మార్చి 2015 (12:06 IST)
హంద్రినీవా ప్రాజెక్టును పూర్తి చేసి రాయలసీమ ప్రాంతానికి నీల్లు అందిస్తామని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావులు వెల్లడించారు. హంద్రినీవా సుజల స్రవంతిని ఎన్టీఆర్ రూపకల్పన చేశారని, దాన్ని పూర్తి చేసే అవకాశం తమకు దక్కిందని వారు చెప్పుకొచ్చారు. ఇక నుంచి హంద్రినీవా పనులను 15 రోజులకొకసారి సమీక్షిస్తామన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన సోమవారం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం ఇప్పటికే 32వేల ఎకరాలను సమీకరించినట్లు దేవినేని చెప్పారు. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ మాట్లాడుతూ హంద్రినీవా పనులను త్వరలో పూర్తి చేసి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామన్నారు. హంద్రినీవా సుజల స్రవంతి కాలువ పనులను మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాధరెడ్డి, దేవినేని ఉమ, ఎమ్మెల్యే బాలకృష్ణ తదితరులు పర్యవేక్షించారు. 

Share this Story:

Follow Webdunia telugu