Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కృష్ణంరాజుకు గవర్నర్ పోస్ట్: ప్రధాని నరేంద్ర మోడీ కసరత్తు!

కృష్ణంరాజుకు గవర్నర్ పోస్ట్: ప్రధాని నరేంద్ర మోడీ కసరత్తు!
, గురువారం, 27 ఆగస్టు 2015 (19:18 IST)
మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి కాలంలో బీజేపీకి సేవలందించిన రెబల్ స్టార్ కృష్ణంరాజుకు గవర్నర్ పోస్ట్ అంటగట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కసరత్తు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాలకు గవర్నర్లను నియమించే పనిలో ఉన్న కేంద్రం.. పనిలో పనిగా కృష్ణంరాజుకు కూడా ఓ గవర్నర్ పోస్టు ఇచ్చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కృష్ణంరాజు ఇటీవల ఆయన్ని కలిశారని వార్తలు వస్తున్నాయి. 
 
ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు, రికార్డుల వర్షం కురిపిస్తున్న బాహుబలి సినిమా సక్సెస్ టాక్ వచ్చాక ఆ సినిమా స్పెషల్‌ షోలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బాహుబలి హీరో ప్రభాస్ కలిసిన సంగతి తెలిసిందే. ఈ భేటీలోనే కృష్ణంరాజుకు మోడీ గవర్నర్ పోస్ట్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఏ రాష్ట్రానికి కృష్ణంరాజు గవర్నర్ అవుతారనేది తేలిపోతుందని రాజకీయ పండితులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu