Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వివాహితపై సామూహిక అత్యాచారం...? ఆసుపత్రికి తరలింపు

వివాహితపై సామూహిక అత్యాచారం...? ఆసుపత్రికి తరలింపు
, సోమవారం, 24 ఆగస్టు 2015 (11:11 IST)
నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఓ వివాహితపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. దంపతులపై దాడి చేసి వారిని దోచుకున్నారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. వివరాలిలా ఉన్నాయి. 
 
సోమవారం తెల్లవారుజామున 3గంటలకు కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ రైలులో హైదరాబాద్‌ నుంచి దంపతులు ఇద్దరు నిజామాబాద్‌కు వచ్చారు. రైలుదిగి ఇంటికి వెళ్ళేందుకు బయలుదేరారు. అయితే అప్పటికే వారిపై కన్నేసిన నలుగురు వారిని అటకాయించారు. భర్తపై దాడి చేశారు. ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించారు. తిరగబడినా ఫలితం లేకుండా పోయింది. తనపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. తరువాత ఆమె మెడలోని బంగారు నగలను దోచుకెళ్ళారు. 
 
దీంతో దంపతులు పోలీసులను ఆశ్రయించారు. ఆమెను వెంటనే వైద్యపరీక్షల కోసం ఆసుపత్రిలో చేర్చించారు. నిందితులలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారిస్తున్నారు. మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu