Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో భక్తులకు టోకరా

శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో భక్తులకు టోకరా
, మంగళవారం, 3 ఆగస్టు 2021 (10:45 IST)
శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో భక్తులకు టోకరా వేసి అధిక మొత్తాలను దండుకుంటున్న నిందితుడిని ఈస్ట్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. చైన్నై భారతీనగర్‌కు చెందిన దివాకర్‌ పార్థసారధి.. ‘రేవతి పద్మావతి’ పేరిట ట్రావెల్స్‌ నిర్వహిస్తున్నాడు.

ప్యాకేజీ రూపంలో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తామంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేశాడు. ఒక భక్తుడికి శ్రీవారి దర్శనం కల్పించేందుకుగాను రూ. 2500 తీసుకునేవాడు. దీనిని గమనించిన టీటీడీ విజిలెన్స్‌ అధికారులు ముందుగా దివాకర్‌ను సంప్రదించారు. భక్తుల్లాగా మాట్లాడి దర్శనం టికెట్ల కోసం అడిగారు.

ఒకరికి రూ.5 వేల చొప్పున దివాకర్‌ డిమాండ్‌ చేశాడు. ఇతడి మోసాన్ని రూఢి చేసుకున్న విజిలెన్స్‌ అధికారులు తిరుపతి ఈస్ట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీటీడీ అధికారుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ప్రకాష్‌కుమార్‌ చెన్నై వెళ్లి దివాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనాలో వరదలు విజృంభణ.. 302 మంది మృతి