Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నల్లగొండ యాక్సిడెంట్‌: సిమీ ఎక్స్ చీఫ్ సలావుద్దీన్ మృతి!

నల్లగొండ యాక్సిడెంట్‌: సిమీ ఎక్స్ చీఫ్ సలావుద్దీన్ మృతి!
, ఆదివారం, 19 అక్టోబరు 2014 (08:43 IST)
సిమీ మాజీ జాతీయాధ్యక్షుడు సలావుద్దీన్ అహ్మద్ (45) కారు ప్రమాదంలో మృతి చెందాడు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో శనివారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదంలో సిమీ మాజీ చీఫ్ మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. 
 
హైదరాబాదులోని చాంద్రాయణగుట్టకు చెందిన సలావుద్దీన్ నల్లగొండలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై కారులో హైదరాబాదు తిరిగి వెళ్తుండగా ప్రమాదంలో మరణించాడు.
 
పెద్దకాపర్తి శివారులోకి రాగానే ముందు వెళ్తున్న వాహనాన్ని సలావుద్దీన్ ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సలావుద్దీన్‌ను చికిత్స నిమిత్తం హైదరాబాదులోని సాయిసంజీవనీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మరణించాడు.
 
సలావుద్దీన్ గతంలో నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇంటర్నేషనల్ ఇస్లామిక్ స్టూడెంట్ మూవ్‌మెంట్ (సిమి) జాతీయ అధ్యక్షుడిగా పనిచేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన సలావుద్దీన్‌పై పలు కేసులు ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu