Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రియుడి సుఖం కోసం.. కొడుకును అమ్మేసి.. కూతురు కళ్ళలో కారం కొట్టి.. చంపేయబోయిన ప్రియురాలు

ప్రియుడి సుఖం కోసం.. కొడుకును అమ్మేసి.. కూతురు కళ్ళలో కారం కొట్టి.. చంపేయబోయిన ప్రియురాలు
, సోమవారం, 6 జులై 2015 (11:08 IST)
ఆమె ప్రియుడి సుఖం మత్తులో కన్నుమిన్ను కనబడకుండా వ్యవహరించింది. నవమాసాలు మోసి పుట్టించుకున్న బిడ్డల్ని చిత్రహింసలకు గురిచేసింది. చిన్నపిల్లాడైన కొడుకు అమ్మేసింది. తన ప్రియుడితో సుఖాలకు అడ్డుగా ఉన్న కన్నకూతుర్ని విడిపించుకోవాలని చూసింది. ఆమె కళ్లలో కారం కొట్టి వళ్లంతా గాయాలు చేసింది. చివరకు తన ప్రియుడి ద్వారా ఆమె గొంతు మీద కాలేసి తొక్కేయబోతున్న సమయంలో పబ్లిక్ వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. 
 
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరంలో ఉన్న మీనాక్షికి పెళ్ళయ్యింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరు కొడుకుకాగా, మరొకరు నాలుగేళ్ల కూతురు. అయితే ఆమెకు అప్పల్ రెడ్డితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో భర్తను వదిలేసింది. ఇక తమకు అడ్డుగా ఉన్న పిల్లల్ని వదిలించుకోవాలనుకుంది. కొడుకును అమ్మేసింది. ఇక నాలుగేళ్ళ కూతురు భవ్యశ్రీని తప్పించుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఆమెకు ఒళ్ళంత గాయాలు పెట్టారు. సిగిరెట్లతో కాల్చారు. 
 
అయినా మొండిఘటం తమతోనే ఉందని భావించి తనతో సహజీవనం చేస్తున్న అప్పల్ రెడ్డితో కలసి చంపేయాలని నిర్ణచించుకుంది. కళ్ళలో కారం కొట్టి గొంతు మీద, పొట్ట మీద కాలేసి చంపే ప్రయత్నం చేశారు. అయితే దీనిని ఆ ప్రాంతవాసులు చూడడంతో అసలు విషయం బయట పడింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu