Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆయన నిర్మాతా.. మా పరువు పోతోంది..! మండలి నుంచి స్మగ్లర్ మస్తాన్ పేరు తొలంగింపు

ఆయన నిర్మాతా.. మా పరువు పోతోంది..! మండలి నుంచి స్మగ్లర్ మస్తాన్ పేరు తొలంగింపు
, శనివారం, 25 ఏప్రియల్ 2015 (15:53 IST)
ఎర్రచందనం స్మగ్లర్ మస్తాన్ వలీ సినిమా నిర్మాత అని తెలిసి టాలీవుడ్ నివ్వెరపోయింది. తమ పరువు పోయిందని టాలీవుడ్ నిర్మాతల మండలి వాపోతోంది. ఎవరిని పడితే వారిని మండలిలో చేర్చుకుంటే ఇలాగే ఉంటుందని చర్చించుకుంటున్నట్లు సమాచారం నిర్మాతగా మారిన ప్రముఖ ఎర్ర చందనం స్మగ్లర్ మస్తాన్ వలీని ఆంధ్రప్రదేశ్ ఫిలించాంబర్ బ్లాక్ లిస్టులో పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 
 
ఇప్పటికే స్మగ్లింగ్ కేసులో అరెస్టయి పోలీసుల కస్టడీలో వున్న మస్తాన్... తన చరిత్రని దాచిపెట్టి సినిమాలు నిర్మించడం ద్వారా సినీ పరిశ్రమకు, నిర్మాణరంగానికి చెడ్డ పేరు తెచ్చాడని భావిస్తున్న నిర్మాతలు, ఫిలిం చాంబర్ ప్రతినిధులు టాలీవుడ్ పరువు పోకుండా ఉండాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 
 
అటు పోలీసుల అరెస్ట్ నుంచి తప్పించుకుని పరారీలో వున్న ఆయన గాళ్‌ఫ్రెండ్, హీరోయిన్ నీతూ అగర్వాల్ పరిస్థితి కూడా అదేనని సినీవర్గాలు చెబుతున్నాయి. ఇదిలావుంటే, ఫిలించాంబర్ వీళ్లని బ్లాక్ లిస్టులో పెట్టినా పెట్టకపోయినా... పెద్ద తేడా ఉండదని పెదవి విరిచే వారూ ఉన్నారు. ఇప్పటికే స్మగ్లింగ్ కేసులో పీకల్లోతు కూరుకుపోయిన ఈ ఇద్దరు ఇక తిరిగి పరిశ్రమకు వచ్చే అవకాశం లేదనేది వారి వాదన. ఇలాంటి నేరస్థులు ఇంకా ఎవరైనా ఉన్నారమే చూసుకోవాలని చెబుతున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu