Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విజయవాడలో దారుణం: కూతురిపైనే కీచక తండ్రి అత్యాచారం!

విజయవాడలో దారుణం: కూతురిపైనే కీచక తండ్రి అత్యాచారం!
, శనివారం, 1 నవంబరు 2014 (18:50 IST)
మహిళలకు బయటా కాదు సొంత ఇంట్లోనే రక్షణ లేకుండా పోయింది. కృష్ణా జిల్లా విజయవాడలోని వాంబే కాలనీలో సభ్యసమాజం సిగ్గుతో తలొంచుకునే దారుణం చోటుచేసుకుంది. తండ్రే కన్నబిడ్డ పాలిట కీచకుడయ్యాడు. అజిత్ సింగ్ నగర్‌లోని వాంబే కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ అప్పారావు (42)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తె (17) పదో తరగతి వరకు చదివింది. 
 
స్థానికంగా ఉండే యువకుడితో ఆమె పరిచయం ఏర్పరచుకుంది. విషయం తెలిసిన అప్పారావు ఆమెపై అత్యాచారం చేయాలని నిర్ణయించుకున్నాడు. బలం కోసమని చెప్పి భార్య, కుమార్తెకు మత్తు మందులు ఇవ్వడం ప్రారంభించాడు. వారిద్దరూ మత్తులోకి జారుకున్నాక కుమార్తెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. 
 
ఈ మధ్యనే అనుమానంతో భార్య అప్పారావును నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో తల్లీకూతుళ్లు గ్రామీణ పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. విచారణలో ఏడాదిగా ఈ దారుణం జరుగుతోందని తెలుసుకున్న పోలీసులు దిగ్భ్రాంతి చెందారు.

Share this Story:

Follow Webdunia telugu