Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాస్ బుక్కుల స్కామ్: 17వేల నకిలీ పాస్ బుక్కుల స్వాధీనం

పాస్ బుక్కుల స్కామ్: 17వేల నకిలీ పాస్ బుక్కుల స్వాధీనం
, ఆదివారం, 5 జులై 2015 (13:30 IST)
అనంతపురం జిల్లాల్లో నకిలీ పట్టాదారు పాస్ బుక్కుల స్కామ్ వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ధర్మవరం కేంద్రంగా గడచిన 15 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ దందాపై తాజాగా పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లాలోని బత్తలపల్లి మండలంలోనే ఏకంగా 17వేల నకిలీ పాస్ బుక్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగానూ నకిలీ పాస్ బుక్కులు జారీ అయ్యాయనే వాదన కూడా వినిపిస్తోందని జిల్లా ఎస్పీ రాజశేఖర బాబు చెప్పారు.
 
ఓవీఆర్వో సహకారంతో రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులు, ప్రైవేట్ వ్యక్తులు జట్టుకట్టి ఈ నకిలీ దందాను నడిపినట్లు ఆధారాలున్నాయని రాజశేఖర బాబు పేర్కొన్నారు. ఇప్పటికే 12 మంది నిందితులను పట్టుకున్నామని, పరారీలోని నిందితులను కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామన్నారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరిపేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu