Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాజీ మావోయిస్టు నేత యాదయ్య గౌడ్‌ను నరికి చంపేశారు!

మాజీ మావోయిస్టు నేత యాదయ్య గౌడ్‌ను నరికి చంపేశారు!
, సోమవారం, 22 సెప్టెంబరు 2014 (09:42 IST)
మహబూబ్‌నగర్ జిల్లా వెల్దండ మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో మాజీ మావోయిస్టు జిల్లా కార్యదర్శి గుణగంటి శ్యామ్ అలియాస్ యాదయ్యగౌడ్(36) ఆదివారం మధ్యాహ్నం దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు వేట కొడవళ్లు, కత్తులు, గొడ్డళ్లు, మారణాయుధాలతో దారుణంగా నరకడంతో తీవ్ర రక్తస్రావంతో గుణగంటి శ్యామ్ కుప్పకూలిపోయాడు.
 
సంఘటన స్థలంలో భార్య గుణగంటి శోభ అలియాస్ కృష్ణమ్మ, కుమారులు రాకేష్, కార్తీక్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామానికి చెందిన శ్యామ్ అలియాస్ యాదయ్యగౌడ్ తన గ్రామం నుంచి భార్య, పిల్లలతో ద్విచక్ర వాహనంపై వెల్దండ వైపు వస్తుండగా గుర్తుతెలియని దుండగులు పథకం ప్రకారం వెల్దండకు మూడు కిలోమీటర్ల దూరంలో తెల్ల కారులో వెనక నుంచి వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు.
 
శోభ కథనం ప్రకారం - కిందపడిపోయిన శ్యామ్‌ను వేట కొడవళ్లు, గొడ్డలతో విచక్షణరహితంగా తల, మెడ భాగంలో బలంగా నరికారు. భార్య, పిల్లలు వేడుకున్నా దుండగులు కనికరించకుండా దారుణంగా నరికి పరారీ అయినట్లు భార్య తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu