Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పట్టాలెక్కిన గజ రాజులు... చెన్నై- బెంగుళూరు మధ్య నిలిచిన రైళ్లు

పట్టాలెక్కిన గజ రాజులు... చెన్నై- బెంగుళూరు మధ్య నిలిచిన రైళ్లు
, శనివారం, 25 అక్టోబరు 2014 (10:02 IST)
చిత్తూరు జిల్లాలో మరోసారి గజ రాజులు వీరంఘం సృష్టించాయి. కుప్పం మండలం, మిట్టపల్లి పరిసర ప్రాంతాల్లో శుక్రవారం అర్థరాత్రి పంట పొలాలను ఏనుగులు ధ్వంసం చేశాయి. అనంతరం ఏనుగుల గుంపు సమీపంలోని రైల్వే ట్రాక్పైకి రావటంతో గమనించిన రైల్వే సిబ్బంది ఈ సమాచారాన్ని అధికారులకు అందించారు. 
 
దీంతో రైల్వే అధికారులు చెన్నై- బెంగళూరు మధ్య నడిచే రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. అనంతరం గంట సేపటి తర్వాత రైళ్ల రాకపోకలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆ మార్గంలో నడిచే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 
 
కాగా పదిహేను రోజుల క్రితం అడవి నుంచి దారి తప్పి గ్రామాల బాట పట్టిన ఏనుగులు చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాలలో భీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికై అధికారులు తగు చర్యలు చేపట్టి, వాటిని అడవిలోకి తరలించాలని కోరుతున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu