Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరెంట్ షాక్... చిత్తూరు జిల్లాలో అడవి ఏనుగు మృతి.... 12 ఏనుగుల ఘీంకారం

కరెంట్ షాక్... చిత్తూరు జిల్లాలో అడవి ఏనుగు మృతి.... 12 ఏనుగుల ఘీంకారం
, శుక్రవారం, 31 అక్టోబరు 2014 (10:12 IST)
చిత్తూరు జిల్లా రామాపురంతండాలోని నక్కలగుట్ట వద్ద కరెంట్ షాక్ తగిలి శుక్రవారం తెల్లవారుజామున ఒక అడవి ఏనుగు మృతి చెందింది. తోటి ఏనుగు మృతి చెందడంతో 12 గజరాజులు మృతి చెందిన ఏనుగు చుట్టూ చేరి ఘీంకారాలు చేస్తున్నాయి. 
 
దీంతో ఆ సమీప గ్రామాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనల వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా  సమాచారం అందుకున్నప్పటికీ అక్కడి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో పోలీసులు, అటవీ శాఖ అధికారులు సైతం సంఘటనా స్థలానికి వెల్లేందుకు వెనుకాడుతున్నట్టు సమాచారం. 
 
కొంతమంది దుండగులు వన్యప్రాణుల కోసం విద్యుత్ వైర్లను అమర్చారు. ఆ విద్యుత్ వైర్లు తగిలి ఏనుగు షాక్తో మృతి చెందిందని అధికారులు భావిస్తున్నారు. కాగా అడవిలో నుంచి దారి తప్పి బయటకు వచ్చిన ఒక ఏనుగుల గుంపు గత రెండు వారాలుగా చిత్తూరు జిల్లాలో సంచరిస్తున్న విషయం తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu