Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశ వ్యాప్తంగా రంజాన్ పర్వదిన వేడుకలు!

దేశ వ్యాప్తంగా రంజాన్ పర్వదిన వేడుకలు!
, మంగళవారం, 29 జులై 2014 (11:09 IST)
రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు మంగళవారం నిర్వహించుకోవాలని రివాయత్ హలాల్ కమిటీ సూచించింది. సోమవారం నెలవంక కనువిందు చేయడంతో మంగళవారం రంజాన్ పర్వదినం అంటూ రివాయత్ హలాల్ కమిటీ స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రేపు ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ సెలవు ప్రకటించాయి.
 
కాగా, రాష్ట్రంలోని ముస్లింలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్ పర్వదినం) శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలోనూ వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. రంజాన్ మాసంలో జరిగే ఇఫ్తార్ విందులతో మతసామరస్యం వెల్లివిరుస్తుందని, ఇలాంటి శుభ సందర్భాల్లో అన్ని వర్గాలు పరస్పరం స్నేహ భావంతో ఉండాలని కేసీఆర్ సూచించారు. అలాగే, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
 
అలాగే, హైదరాబాదు చిలకలగూడ ఈద్గాలో ఏర్పాటుచేసిన రంజాన్ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. మరోవైపు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లింలు మసీదుల్లో ప్రార్థనలు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu