Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎంసెట్ పేపర్ లీక్ చేసింది నిషాద్.. సీఐడీ :: ఎంసెట్ పరీక్ష రద్దు దిశగా ఆలోచనలు!

తెలంగాణ ఎంసెట్-2 ప్రశ్నపత్రంను ప్రింటింగ్ ప్రెస్ నుంచి షేక్ నిషాద్ లీక్ చేశాడని సీఐడీ అధికారులు నిర్ధారించారు. ముంబైలో అతడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. నిషాద్‌లో పాటు అతడి అనుచరుడు గుడ్డూను కూడ

ఎంసెట్ పేపర్ లీక్ చేసింది నిషాద్.. సీఐడీ :: ఎంసెట్ పరీక్ష రద్దు దిశగా ఆలోచనలు!
, గురువారం, 28 జులై 2016 (11:26 IST)
తెలంగాణ ఎంసెట్-2 ప్రశ్నపత్రంను ప్రింటింగ్ ప్రెస్ నుంచి షేక్ నిషాద్ లీక్ చేశాడని సీఐడీ అధికారులు నిర్ధారించారు. ముంబైలో అతడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. నిషాద్‌లో పాటు అతడి అనుచరుడు గుడ్డూను కూడా సీఐడీ అధికారులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.
 
ఈ వ్యవహారంతో సంబంధంతో ఉందని అనుమానిస్తున్న రిజోనెన్స్ వి మెడికల్ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు వెంకట్రావును కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ లీకేజీ వ్యవహారంలో ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేశారు. అలాగే, లీకేజీతో జేఎన్టీయు ప్రొఫెసర్‌కు సంబంధం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.
 
మరోవైపు.. ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో రూ.50 కోట్లు చేతులు మారినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో విద్యార్థి నుంచి రూ.30-40 లక్షల తీసుకున్నట్టు తెలుస్తోంది. 72 మంది విద్యార్థులకు ప్రశ్నాపత్రం లీక్ చేసినట్టు సీఐడీ అధికారులు ఆధారాలు సంపాదించారు. ఈ లీకేజీకి ప్రధాన సూత్రధారుడైన బ్రోకర్ రాజగోపాల్ రెడ్డితో పాటు ముఠా సభ్యులు రమేశ్, తిరుమల్, విష్ణును ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెల్సిందే.
 
మరోవైపు.. ఎంసెట్‌ పరీక్షను రద్దు చేసే అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది. సీఐడీ నివేదిక తర్వాత రద్దుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంకోవైపు.. ఇప్పటివరకు 3 పరీక్షలు రాసిన విద్యార్థులకు ఎంసెట్-2 లీకేజీ కారణంగా మరోసారి పరీక్ష రాయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో విద్యార్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎవరో కొందరు చేసిన లీకేజీ పాపానికి తాము బలి అవుతున్నామని గోడు వెళ్లబోసుకుంటున్నారు. మళ్లీ పరీక్ష రాస్తే మంచి ర్యాంకు వస్తుందో రాదోనని మధనపడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీఎస్ ఎంసెట్-2లో మరో మలుపు... జేఎన్టీయూ ప్రొఫెసర్ హస్తం!