Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జంగారెడ్డిగూడెంలో ఫైనాన్షియర్ దంపతులు దారుణ హత్య!

జంగారెడ్డిగూడెంలో ఫైనాన్షియర్ దంపతులు దారుణ హత్య!
, శుక్రవారం, 21 నవంబరు 2014 (15:23 IST)
వెస్ట్ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఫైనాన్షియర్ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ జంట హత్యలు స్థానికంగా కలకలం సృష్టించింది. విజయ పేరుతో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న లక్ష్మణరావును కొంతమంది దుండగులు పెట్రోల్ బంక్ సమీపంలో గొడ్డలితో నరికి హత్య చేశారు. 
 
భర్త లక్ష్మణ రావును రక్షించుకునేందుకు భార్య తులసి అడ్డురాగా ఆమెను కూడా కిరాతకులు హత్య చేశారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయాందోళనలు గురయ్యారు. 
 
ఈ జంట హత్యలకు పాత కక్షలే ప్రధాన కారణం కావచ్చని అనుమానిస్తున్నారు. దీనిపై సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణం గురువారం అర్థిరాత్రి దాటాక జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu