Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలుగుదేశం పార్టీలో చేరనున్న డొక్కా మాణిక్య వరప్రసాద్‌

తెలుగుదేశం పార్టీలో చేరనున్న డొక్కా మాణిక్య వరప్రసాద్‌
, శనివారం, 29 ఆగస్టు 2015 (22:26 IST)
మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయన ఇప్పటికే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం ఏపీ సీఎం, తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. 
 
మాణిక్య వరప్రసాద్‌ ఇటీవల వైకాపాలో చేరతారనే ప్రచారం జరిగింది. ఒక దశలో ఆయన నిర్ణయం తీసుకున్నారు. మారుతన్న పరిస్థితులను అనుసరించి ఆయన మనసు మార్చుకుని రాష్ట్రాభివృద్ధికి తెలుగుదేశం చేస్తున్న కృషికి ఆకర్షితులై తమ పార్టీలో చేరుతున్నారని నాయకులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu